రీమేక్ కు త్రివిక్రమ్ బై..?

టీ సిరీస్ భాగస్వామ్యం డిమాండ్ కు బన్నీ-త్రివిక్రమ్ సినిమా మళ్లీ మొదటికి వచ్చింది. స్ట్రయిట్ కథ ను రెడీ చేసే పనిలో బిజీగా వున్నారు. హిందీ సినిమా రీమేక్ చేయాలన్న ఆలోచన చేయడం, బన్నీ కూడా దానికి సై అనడం. కానీ కేవలం పాయింట్ మాత్రం తీసుకుని, కథ స్వంతంగా చేసుకుంటామని అడిగినా, మాతృక హక్కు దారులైన టీ సిరీస్ సంస్ధ, భాగస్వామ్యం కోసం అడ్డం తిరిగింది.

హక్కులు అమ్మమని, తెలుగు ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేసింది. దాంతో అన్ని ప్రయత్నాలు అయిపోయాక, ఇప్పుడు వేరే కథతో ముందుకు వెళ్లాలని త్రివిక్రమ్-బన్నీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ కథకు, హిందీ సినిమా పాయింట్ ఏమన్నా కలుస్తుందా? లేదా? అన్నది ఇంకా తెలియదు.

ప్రస్తుతానికి త్రివిక్రమ్ అయితే కథ రెడీ చేసే పనిలో బిజీగా వున్నారు. ఇదిలా వుంటే అసలు ఇంతకీ ఈ సినిమా గీతా-హారిక హాసిని భాగస్వామ్యమా? లేక గీతా సోలోనా? అన్నది ఇంకా తేలలేదు. ఆ పంచాయతీ కూడా అలాగే వుంది. ఈ పంచాయతీలు అన్నీ తేలనందునే సినిమా ప్రకటన ను పక్కన పెట్టారు.కథ రెడీ కావాలి. నిర్మాణ బాధ్యతలు ఎవరివో అన్నది క్లారిటీ రావాలి. అప్పుడు కానీ బన్నీ తరువాత సినిమా ప్రాజెక్టు అధికారిక ప్రకటన బయటకు రాదు.

Show comments