పృథ్వీకి పదవి.. అధికారికం!

సినీనటుడు పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి లభించడం అధికారికం అయ్యింది. టీటీడీ బోర్డు మీటింగులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పోస్టు దక్కుతుందని గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపించాయి. చివరికి అవి నిజం అయ్యాయి.

ఎస్వీబీసీ చైర్మన్ కమ్ డైరెక్టర్ గా పృథ్వీ కొనసాగనున్నారని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైన సినిమా వాళ్లలో ఒకరిగా నిలిచారు పృథ్వీ. జగన్ పార్టీ తరఫున గట్టిగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పృథ్వీ అనుకూలంగా గళంవిప్పారు.

గతంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో దర్శకుడు కే.రాఘవేంద్రరావు ఉండేవారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారగానే ఆయన ఆ పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ పదవి ఇప్పుడు పృథ్వీకి దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా సపోర్ట్ గా నిలిచిన సినిమా వాళ్లు తక్కువమందే. వారిలో పృథ్వీ ముందున్నారు.

ఎన్నికల సమయంలో అలీ కూడా ఆ పార్టీలో చేరారు. ఆయనకూ పదవి విషయంలో కొన్ని ఊహాగానాలున్నాయి. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..