ప్రభాస్ కు కథ చెప్పిన పరుశురామ్

డైరక్టర్ పరుశురామ్ సినిమా జర్నీలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఓ పక్క 14రీల్స్ లో నాగ్ చైతన్యతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే, హీరో ప్రభాస్ కు కథ చెప్పడానికి రంగం సిద్దం చేసుకున్నారు. తన మిత్రుడు బన్నీవాస్ ద్వారా ఓ మాట చెప్పించుకుని, ఆ మధ్య యువి వంశీకి వెళ్లి కథ చెప్పి వచ్చారు. 

ఇప్పుడు ఆ కథనే హీరో ప్రభాస్ కు నెరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న ప్రభాస్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు బోగట్టా. మరి కథ విన్న తరువాత ఆయనేమన్నారు, ఎప్పటికి నిర్ణయం చెబుతారు అన్నది తెలియాల్సి వుంది.

ఆ సంగతి అలా వుంటే 14 రీల్స్ లో మాత్రం 8 కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో కాస్త వాటా ప్రాతిపదికన ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. నాగ్ చైతన్య ఓకె అంటే ఆ సినిమా వుంటుంది. చైతన్య  ప్రస్తుతం అటు అజయ్ భూపతి, ఇటు పరుశురామ్ ల మధ్య ఊగిసలాడుతున్నట్లు బోగట్టా.

Show comments