అక్క‌డి వ‌ర‌కు గౌను, చేతిలో విస్కీ!

కాదేదీ క‌విత‌కు అన‌ర్హ‌మ‌ని మ‌హాక‌వి శ్రీ‌శ్రీ అంటే... కాదేదీ డ‌బ్బు సంపాద‌న‌కు అన‌ర్హ‌మ‌ని  'రాధేశ్యామ్‌' బ్యూటీ పూజా హెగ్డే చేసి చూపుతోంది. ఎవ‌రేమ‌నుకున్నా... డోంట్ కేర్ అనే రీతిలో ఆమె అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. డ‌బ్బు సంపాద‌న‌కు సోష‌ల్ మీడియాను మంచి వేదిక‌గా సినీ సెల‌బ్రిటీలు ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. నైతిక‌త వ‌దిలిస్తే ...ఆర్థికంగా ఎంతైనా ఎద‌గొచ్చ‌నే సూత్రాన్ని మ‌రీ ముఖ్యంగా ముద్దుగుమ్మ‌లు ప‌సిగ‌ట్టారు.

అందుకే కాబోలు సోష‌ల్ మీడియా ప్లాట్‌పామ్స్‌పై హోయ‌లొలుకుతూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ జాబితాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే చేరారు. తాజాగా ఈ బ్యూటీ అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతుండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

తాజాగా ఓ కంపెనీ విస్కీ ప్ర‌చారానికి పూజా హెగ్డే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఆమె  మోకాళ్ళు పైభాగం వరకు గౌను ధరించి, స‌ద‌రు ప్ర‌ముఖ కంపెనీ తయారు చేసిన  విస్కీని ఒక గ్లాసులో పోసి, అందులో ఐస్‌ క్యూబ్స్‌, సోడా పోసి కలుపుతుంది. అనంతరం చిందులు తొక్కుతుంది.

ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను వీడియో తీసి త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిందామె. ఈ వీడియో వైర‌ల్ అయింది. డ‌బ్బు కోసం ఇంత‌గా దిగ‌జారాలా, నైతిక విలువ‌లు లేవా అంటూ పూజా హెగ్డేపై నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే పూజా హెగ్డే కోరుకున్న‌ట్టు ఆ కంపెనీ విస్కీకి పెద్ద ఎత్తున ప్ర‌చారం వ‌స్తోంది. ఇదే క‌దా ఆమె కోరుకుంటున్న‌ది కూడా.  

Show comments