పవన్-రానా-అయ్యప్పన్ ఫిక్స్

మొత్తానికి అయ్యప్పన్ కోషియమ్ కథ కొలిక్కి వచ్చింది. బాలయ్య దగ్గర ప్రారంభమై రవితేజ మీదుగా పవన్ దగ్గరకు వచ్చి సెటిల్ అయ్యింది. 

అలాగే డైరక్టర్లుగా రకరకాల పేర్లు వినిపించి, ఆఖరికి ఎవరూ దొరక్క, స్క్రిప్ట్ తయారీకి వర్క్ చేసిన సాగర్ నే డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. హరీష్, బాబీ ఇలా చాలా మందిని అనుకున్నారు కానీ కుదరలేదని తెలుస్తోంది. 

ఇక మిగిలింది అధికారికంగా ప్రకటించడమే. ఈ దసరాకు అధికారికంగా ప్రకటించే ప్రయత్నం జరుగుతోంది.

పవన్ తో కోన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోవాల్సి వుంది. అవి కనుక ఈ రోజు,  రేపు పూర్తయిపోతే, అధికారిక ప్రకటన దసరాకు వస్తుంది లేదూ అంటే మరి కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.

ఇప్పటికే ప్రాజెక్టును పవన్ తో కలిసి చేయబోతున్నట్లు మరో హీరో రానాకు చెప్పారు. ఆయన వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సినిమాను సింగిల్ షెడ్యూలులో ఫినిష్ చేయాలనుకుంటున్నారు. 

మాంచి అవుట్ డోర్ లోకేషన్ లో ఒకటి రెండు సెట్ లు వేసి, అక్కడే మొత్తం షూట్ ముఫై నుంచి ముపై అయిదు రోజుల్లో ఫినిష్ చేయాలన్నది నిర్మాతలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే టోటల్ సినిమాలో పవన్ కాల్ షీట్లు గట్టిగా 20 కూడా అవసరం పడవని తెలుస్తోంది. అందుకే సింగిల్ షెడ్యూలులో ఫినిష్ చేసే ఆలోచనలో వున్నారు. పవన్ కు చాలాతక్కువ కాల్  షీట్లతో సరిపోతుందనే ఈ సినిమాకు ఓకె  చేసినట్లు కనిపిస్తోంది. 

అవి.. ఎవ‌రి ఆశ‌ల పునాదులో చెప్ప‌వేం ఈనాడూ! 

Show comments