నిఖిల్, అఖిల్ మాత్రమే కాదు.. పవన్ కూడా..?

ఉన్నట్టుండి సడెన్ గా కొత్త బ్యానర్ పెట్టాడు రామ్ చరణ్. తన ఫ్రెండ్ విక్కీ (యూవీ విక్కీ)తో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించాడు. దీనిపై తొలి చిత్రంగా అఖిల్ హీరోగా సినిమా వస్తుందని అంతా ఆశించారు. అయితే నిఖిల్ హీరోగా 'ది ఇండియా హౌజ్' అనే ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. అయితే ఈ బ్యానర్ లిస్ట్ లో మరికొంతమంది హీరోలు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చరణ్ స్థాపించిన కొత్త బ్యానర్ పై పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు.

పవన్ నిర్మాతగా చరణ్ హీరోగా ఓ సినిమాపై అప్పట్లో చాలా డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత, బాబాయ్ పవన్ హీరోగా, సినిమా నిర్మిస్తామని చరణ్ కూడా ప్రకటించాడు. ఇప్పుడీ ప్రాజెక్టు కొత్త బ్యానర్ పై సెట్ అయ్యేలా కనిపిస్తోంది. పవన్ కోసం ఓ రీమేక్ సబ్జెక్ట్ రెడీగా ఉందంట.

అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పట్లో ప్రకటన రాకపోవచ్చు. ప్రస్తుతానికి నిఖిల్ సినిమాపై మాత్రమే చరణ్-విక్కీ దృష్టి పెట్టారు. త్వరలోనే అఖిల్, శ్రీవిష్ణుతో కూడా ప్రాజెక్టులు ప్రకటించబోతున్నారు. పవన్ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత, అతడు ఓకే చెబితే అప్పుడు 'వి మెగా పిక్చర్స్' బ్యానర్ పై పవన్ హీరోగా, చరణ్ నిర్మాతగా సినిమా ప్రకటన వస్తుంది.

Show comments