పార్క్ హయాత్-పరువు పోతోంది?

పార్క్ హయాత్. హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ హోటల్. ఇందులో కేవలం హోటల్ గదులు మాత్రమేకాదు, సర్వీస్ అపార్ట్ మెంట్ టైపు ఫ్లాట్స్ కూడా వున్నాయి. ఈ హోటల్ టాలీవుడ్ లో, రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన సుబ్బరామిరెడ్డిది. ఆయన పరిచయాలు కావచ్చు, ఆయన ఇచ్చే కన్సెషన్లు కావచ్చు, పైగా హోటల్ లెవెల్ కావచ్చు. సినిమా జనాలంతా ఈ హోటల్ నే వాడుతుంటారు ఎక్కువగా.

హీరోయిన్ సమంత, మహేష్ బాబు, త్రివిక్రమ్ లాంటి వాళ్లు ఇందులో సర్వీస్ అపార్ట్ మెంట్లను పెర్మనెంట్ గా తీసుకున్నారు. ఏడాదికి లక్షల్లో అద్దె చెల్లిస్తుంటారు. గతంలో నిర్మాత బెల్లంకొండ కొన్నాళ్లు ఈ హోటల్ లోనే ఫ్యామిలీతో నివాసం వున్నారు కూడా.

అలాంటి క్వాలిటీ హోటల్ పరువుపోయేలా కనిపిస్తోంది బయటకు వస్తున్న కొన్ని వ్యవహారాలతో. ఆ మధ్య శ్వేతాబసు వ్యవహారం జరిగింది ఈ హోటల్ లోనే. ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నది ఈ హోటల్ లో జరిగే కార్యకలాపాలపైనే.

నేరుగా హోటల్ మీద ఆరోపణలు చేయడంలేదు కానీ, జీవన్ రెడ్డి (తెలంగాణ రాజకీయ నాయకుడు) ఈ హోటల్ లో పర్మనెంట్ రూమ్ తీసుకుని, రాసలీలలు సాగిస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించడం అంటే హోటల్ పరువు తీయడమే కదా?

టీఎస్సార్ కు వున్న టాలీవుడ్, రాజకీయ మొహమాటాలు ఇన్నీ అన్నీ కావు. బిల్లులో కన్సెషన్లు, ఫ్రీ రూమ్ లు ఇలాంటివి వుంటూనే వుంటాయి. పార్క్ హయాత్ బయటవాళ్లకు ఇచ్చే రేటు వేరు. టాలీవుడ్ జనాలు అంటే ఇచ్చే రేటు వేరు అని తెలుస్తోంది.

ఇలాంటి సదుపాయాలు ఇస్తుంటే, వాటిని వాడుకోవాలి కానీ, శ్రీరెడ్డి చెబుతున్న టైపు కార్యకలాపాలకు వాడేసుకోవడం అంటే పాపం, టీఎస్సార్ ముచ్చటగా కట్టుకున్న హోటల్ పరువుతీయడం కాక మరేమిటి?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments