మరోసారి నిలువునా ముంచబోతున్న లగడపాటి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఏమైందో అంతా చూశాం. అతడ్ని నమ్మి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు బెట్టింగ్ రాయళ్లు. అలా ఓ వర్గం లగడపాటి చేతిలో దారుణంగా మోసపోగా.. ఇప్పుడు మరో బ్యాచ్ కూడా రెడీ అయింది. కేవలం లగడపాటి సర్వేను నమ్మి ఆఖరి ఈ 2 రోజుల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ లు కాస్తున్నారు కొందరు.

తెలంగాణ ఎన్నికల్లో ఫెయిలైన లగడపాటి జోస్యం, ఏపీ ఎన్నికల్లో నిజమౌతుందని వీళ్లు నమ్ముతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగ్ జరగ్గా.. లగడపాటి సర్వే ఫలితాలు బయటకొచ్చిన తర్వాత బెట్టింగ్ మొత్తం మరో 300 కోట్ల రూపాయలకు పెరిగిందనేది అనధికారిక లెక్క.

అంటే, వీళ్లంతా లగడపాటిని నమ్మి డబ్బు పెట్టారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్లంతా మరికొన్ని గంటల్లో దివాలా తీయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కేవలం లగడపాటిపై ఉన్న గుడ్డి నమ్మకంతోనే ఓ వర్గం ఆఖరి నిమిషంలో బెట్టింగులకు దిగిందని చెబుతున్నారు. మరోవైపు లగడపాటి సర్వేతో సంబంధం లేకుండా వైసీపీపై పందెం కాస్తున్న జనాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

అనధికారిక సమాచారం ప్రకారం, ఈరోజు సాయంత్రంతో అన్ని బెట్టింగ్స్ ను లాక్ చేయబోతున్నారు. ఈలోగా ఎవరైనా విత్ డ్రా అవ్వాలంటే అవ్వొచ్చు. లేదంటే వాళ్ల పందెం లాక్ అవుతుందన్నమాట. రేపు మధ్యాహ్నం నుంచి రాబోతున్న ఫలితాల ఆధారంగా బెట్టింగ్ లో గెలిచిన వాళ్లకు 24 గంటల నుంచి 2 రోజుల్లోగా డబ్బులు సెటిల్ చేస్తారు. 

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం

Show comments