సీనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టకు మరో పరీక్ష!

ఆయన మరణించే ముందు.. తనకు అయినవాళ్లు చేసిన ద్రోహం విషయంలో ఆక్రోశించారు. అల్లుడిని ఔరంగజేబుతో పోలుస్తూ.. ఆ వ్యథతోనే మరణించారు. తనను నమ్ముకున్న వాళ్లే మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని.. తన పిల్లలే తనకు ద్రోహం చేశారని.. వాపోయారు. అలా క్షోభతోనే కాలం చేశారు. అయితే ఆయన మరణించాకా కూడా.. ఆయన వారసులు ఆయనను ఊరికే వదలడం లేదు.

అన్నగారు.. నాన్నగారు.. అంటూ.. తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వాడుకొంటూనే ఉన్నారు. ప్రతియేటా జయంతిరోజు, వర్ధంతిరోజు.. మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ తో రకరకాల ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. అలా ఎన్టీఆర్ తో తమకు అవసరమైన రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఈ పరంపరలో సీనియర్ ఎన్టీఆర్ కు ఆయన వారసులు రేపు మరో పరీక్షను పెడుతున్నారు.

అది ఎన్టీఆర్ కు ఒక గుర్తింపును ఇచ్చి.. ఆయనను చిరంజీవిగా మార్చిన ‘సినిమా’తో! ఎన్టీఆర్ పై ఆయన తనయుల ‘చిత్ర’ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. తను హీరోగా, దర్శకుడిగా వ్యవహరించి.. ఎన్టీఆర్ ఎంతోమంది నిర్మాతలకు భారీ లాభాలను అందించారని.. అయితే ఆయన బయోపిక్ పేరుతో ఆయన వారసులు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాసులు మిగిల్చారనే కామెంట్లూ తప్పడంలేదు.

ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో అనుభవించిన స్టార్ డమ్ కు ఆయన బయోపిక్ కు వచ్చిన నష్టాలకూ పొంతనలేదని ఆయన అభిమానులే వాపోతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ పరీక్ష ఒకసారితో కూడా అయిపోలేదు. రేపు సీనియర్ ఎన్టీఆర్ కు ఆయన వారసులు మరో పరీక్షను పెడుతున్నారు.

రెండోపార్టులో ఎన్టీఆర్ రాజకీయ శక్తిని కూడా తక్కువ చేసేసి.. చంద్రబాబును హీరోగా చేసే ప్రయత్నం సాగినట్టుగా ఉందనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్టుతో ఎన్టీఆర్ గా బాలయ్య నటనతో ఎన్టీఆర్ ను నటుడిగా ఆయన స్థాయి నుంచి దించి, సెకెండ్ పార్టులో రాజకీయ నేతగా ఆయన స్థాయిని దించేశారా లేక.. రెండోభాగంతో ఫస్ట్ పార్ట్ తో మిగిలిన అసంతృప్తిని కూడా భర్తీ చేస్తారా.. మరి కొన్ని గంటల్లో తేలిసిపోతుంది!

రాయలసీమ రైతుల పుండుపై కారం