ఎన్టీఆర్‌ ఫాన్స్‌ని టెన్షన్‌ పెడుతున్న రాజమౌళి

యూట్యూబ్‌ ఛానల్స్‌, వెబ్‌సైట్స్‌ విపరీతంగా పెరిగిపోవడంతో న్యూస్‌ 'వండడం' ఇప్పుడు చాలా మామూలైపోయింది. నిర్మాణంలో వున్న ప్రతి భారీ చిత్రం గురించి పుకార్లు పుట్టిస్తూనే వుంటున్నారు. అందులోను రాజమౌళి సినిమా అంటే ఈ పుకార్ల బెడద తీవ్రంగా వుంటుంది. ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి నటిస్తుండేసరికి రాసుకున్నవారికి రాసుకుంత అన్నట్టయింది.

రాజమౌళి ఈ చిత్రం స్టోరీ లైన్‌ ఏమిటనేది చెప్పేవరకు ఎవరికి వారు ఇష్టానికి దీని గురించి కథలు అల్లేసారు. ఒకసారి ప్రెస్‌మీట్‌ పెట్టి పుకార్లకి బ్రేక్‌ వేసారులే అనుకునేంతలో ఈ చిత్రంలోంచి ఒక హీరోయిన్‌ని తొలగించారు. ముందుగా అనుకున్న డెయిసీ ఎడ్గార్‌ జోన్స్‌ని తప్పించడంతో మళ్లీ ఆమె స్థానంలో ఎవరనే పుకార్లు స్టార్ట్‌ అయ్యాయి. ఇది సహజంగానే ఎన్టీఆర్‌ ఫాన్స్‌ని కలవరపెడుతోంది.

చరణ్‌ సరసన బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ ఆలియా భట్‌ నటిస్తోంటే, ఎన్టీఆర్‌ సరసన నిత్యామీనన్‌ అంటూ వార్తలు పుట్టించి ఫాన్స్‌ని కంగారు పెడుతున్నారు. విదేశీ తార కావాలని భావించిన పాత్రకి నిత్య మీనన్‌ని ఎలా తీసుకుంటారనే తర్కం కూడా ఎవరూ ఆలోచించడం లేదు.

ఈ చిత్రానికి సంబంధించి సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ యాక్టివ్‌గానే వున్నా కానీ చాలా పుకార్ల గురించి చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. చిత్ర బృందానికి ఈ పుకార్లు కామెడీగా అనిపించవచ్చు కానీ అభిమానులు మాత్రం టెన్షన్‌ పడిపోతున్నారు.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను

Show comments