వినయ విధేయ.. చీఫ్ గెస్ట్ గా ఊహించని స్టార్?

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అఫీషియల్ ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు.

సాధారణంగా మెగా కాంపౌండ్ హీరోల సినిమాలకు, అదే కాంపౌండ్ కు చెందిన హీరోలు ప్రత్యేక అతిథులుగా హాజరువుతుంటారు. సినిమా ఏదైనా చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. అడిగిన వెంటనే ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. చెర్రీ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాకు, రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ మూవీకి కూడా డీవీవీ దానయ్యే నిర్మాత. పైగా చెర్రీ-తారక్ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టే.. రామ్ చరణ్ మూవీ ఫంక్షన్ కు ఎన్టీఆర్ వస్తున్నాడు.

ఇలా మరో హీరో ఫంక్షన్ కు హాజరవ్వడం ఎన్టీఆర్ కు ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తారక్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ కు కూడా వస్తున్నాడు. ఈ నెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటి వారంలో వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. విజయవాడలో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments