ఎన్టీఆర్ అభిమాని మృతి

బింబిసార సినిమా ఫంక్షన్ కు హాజరలైన ఎన్టీఆర్ అభిమాని ఒకరు మరణించారు. కానీ ఏం జరిగిందన్నది తెలియడం లేదు. 

బింబిసార ఫంక్షన్ నుంచి సరాసరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ జరిగిందో విచారించమని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మృతుడి పేరు సాయిరామ్ అని తెలిసింది.

ఫంక్షన్ లో ఏమైనా అనుకోని సంఘటన జరిగిందా? కిందపడ్డాడా? లేక కొట్లాట జరిగిందా? అని రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అదేమీ కాదు, మూర్చ వచ్చి పడిపోయాడని కూడా వినిపిస్తోంది. కానీ ఆ కుర్రాడికి అలాంటి సమస్యలు ఏమీ లేవని కూడా అంటున్నారు.

సాయిరామ్ సంబంధీకులతో మాట్లాడితే తమకు ఏం జరిగిందో తెలియదని, పోలీసులను విచారించాలని కోరుతూ ఫిర్యాదు చేసామని అన్నారు. 

Show comments