బ్రహ్మణి, భువనేశ్వరిలకు సెక్యూరిటీ ఉపసంహరణ!

నారా కుటుంబ సభ్యులకు సెక్యూరిటీని ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రహ్మణిలకు ప్రభుత్వ భద్రత రద్దు అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని మంగళవారం రిటర్న్ అయిన నారా ఫ్యామిలీకి ఇలా స్వాగతం పలికింది ఏపీ ప్రభుత్వం.

అలాగే నారాలోకేష్ కు కూడా ప్రభుత్వ భద్రతను తగ్గించారు. ఇన్నాళ్లూ లోకేష్ కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉండేది. అయితే ఆయన సెక్యూరిటీని ఇప్పుడు నలుగురు గన్ మెన్లకు పరిమితం చేశారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు లోకేష్ కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చారు.

ఇక హెరిటేజ్ వ్యాపారులుగా చలామణిలో ఉన్న భువనేశ్వరి, బ్రహ్మణిలకు కూడా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి.. అప్పుడు అలా చేయగలిగారు. అయితే ఇప్పుడు ఆయన మాజీ కావడంతో.. ఆయన భార్యకు, కోడలికి ఉన్న ప్రభుత్వ భద్రత రద్దు అయ్యింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తెగ ఫీల్ అయిపోతూ ఉంది!

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

Show comments