అఖిల్ కోసం కల్యాణ్ రామ్ త్యాగం

అఖిల్ సినిమా ఆల్ మోస్ట్ రెడీ అయింది. కల్యామ్ రామ్ నటిస్తున్న సినిమా ఇప్పటికే సిద్ధంగా ఉంది. అనుకోకుండా ఇద్దరూ జనవరి ఎండింగ్ లోనే థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అఖిల్ కోసం కల్యాణ్ రామ్ చిన్నపాటి త్యాగం చేశాడు. తన సినిమాను వాయిదా వేసుకున్నాడు.

అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాను జనవరిలో విడుదల చేస్తామంటూ మొదట్నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. చెప్పినట్టుగానే తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కల్యాణ్ రామ్ తన సినిమాను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నాడు.

గుహన్ దర్శకత్వంలో 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమా ఇప్పుడు అనివార్యంగా ఫిబ్రవరికి వాయిదాపడబోతోంది. ఇటు కల్యాణ్ రామ్, అటు అఖిల్ ఇద్దరికీ ఈమధ్య కాలంలో హిట్స్ లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో తలపడితే ఇద్దరికీ నష్టం. అందుకే ఈ నిర్ణయం.

మిస్టర్ మజ్ను విషయానికొస్తే ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మరో 10 రోజుల్లో ఆ పాటను కూడా పూర్తిచేయబోతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి హిట్ అంటే ఏంటో తెలియని అఖిల్, మిస్టర్ మజ్నుతో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

Show comments