బాబు బుట్టలో చేపకు వల వేస్తున్న పవన్!

అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు.. ఒకే వ్యక్తికి వల వేస్తున్నారు. అతడిని తమ పార్టీల్లోకి రప్పించుకోవడానికి వీళ్లిద్దరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలా ఇద్దరు నేతల ముద్దుల నేత మరెవరో కాదు చలమలశెట్టి సునీల్. ఇతడిని చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు చాన్నాళ్ల నుంచినే కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బాబు అనుకూల మీడియా కూడా ధ్రువీకరించింది.

సునీల్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలుమార్లు సమావేశం అయ్యాడని.. త్వరలోనే చేరిక అని టీడీపీ పత్రికలు చెబుతూ ఉన్నాయి. ఇది కొత్తగా కాదు.. చాన్నాళ్ల నుంచి చెబుతున్న మాటే. వాళ్లైతే ఇలా చెబుతున్నారు కానీ.. సునీల్ మాత్రం ఇప్పటి వరకూ టీడీపీ లోకి చేరింది లేదు.

ఇటీవల కూడా టీడీపీ పత్రికలు అదే మాటే చెప్పాయి. సునీల్ చేరుతున్నాడని అన్నాయి. అయితే.. ఇంతలోనే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది. సునీల్ తో పవన్ కూడా చర్చలు జరిపాడని.. ఆయన జనసేనలోకి చేరుతున్నాడని పవన్ అనుకూలురు ప్రచారం చేస్తున్నారు.

జనసేనలోకి సునీల్ చేరికకు అంతా సిద్ధం అయ్యిందని కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో సునీల్ వైఎస్సార్సీపీ నుంచి త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు.

అటు చంద్రబాబు రమ్మంటున్నాడు, ఇటు పవన్ రమ్మంటున్నాడు. చంద్రబాబు అనుకూల వర్గాలేమో ఆయన చేరిపోయినట్టే అని అంటున్నాయి. ఆయనకు టీడీపీ తరఫున ఎంపీ టికెట్ కూడా ఖరారని చెబుతున్నాయి. ఇంతలో జనసేన రంగంలోకి దిగి అతడు తమ వైపు అని అంటోంది.

ఇదంతా చూస్తుంటే బాబు బుట్టలో పడ్డ వ్యక్తికి పవన్ గాలం వేస్తున్నాడని స్పష్టం అవుతోంది. ఇంతకీ ఈ చేప ఎవరి బుట్టలోకి చేరుతుందో!

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments