మా అక్క‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పే రోజు వ‌స్తుందిః వైఎస్ అవినాష్‌

వైఎస్ వివేకా హ‌త్య‌పై నిందారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మ‌రోసారి త‌న అక్క‌లు ష‌ర్మిల‌, సునీత గురించి మాట్లాడారు. త‌న అక్కలు ఏదో ఒక రోజు క్ష‌మాప‌ణ‌లు చెప్పే రోజు వ‌స్తుంద‌న్నారు. 

వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డే హంత‌కుడ‌ని ష‌ర్మిల‌, సునీత నిత్యం విమ‌ర్శించే సంగ‌తి తెలిసిందే. దీంతో వివేకా హ‌త్య‌పై సునీత‌, ష‌ర్మిల‌తో పాటు మ‌రికొంద‌రు ఇష్టానుసారం మాట్లాడ్డంపై అడ్డుక‌ట్ట వేయాల‌ని కోరుతూ వైసీపీ క‌డ‌ప కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల‌, సునీత‌తో పాటు చంద్ర‌బాబు, పురందేశ్వ‌రి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీటెక్ ర‌వి త‌దిత‌రులు మాట్లాడొద్ద‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. 

అయిన‌ప్ప‌టికీ ష‌ర్మిల‌, సునీత ప‌దేప‌దే వివేకా హ‌త్యపై మాట్లాడుతూ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప కోర్టు జ‌రిమానా గురించి తెలిసిందే. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న నిర్దోషిత్వం గురించి ప్ర‌జ‌ల‌కు చెప్పేందుకు అవినాష్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. వివేకా హ‌త్యతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

త‌న అక్క‌లు సునీత‌, ష‌ర్మిల‌తో పోరాడే శ‌క్తి ప్ర‌జ‌లే త‌న‌కిస్తార‌ని అవినాష్ ఇవాళ అన్నారు. వివేకా హ‌త్య‌కు సంబంధించి వాస్త‌వాలు ఏదో ఒక రోజు బ‌య‌టికొస్తాయ‌న్నారు. ఆ రోజు త‌న‌కు వాళ్లే క్ష‌మాప‌ణలు చెబుతార‌ని అవినాష్ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న‌ను లేకుండా చేయాల‌నుకుంటే దేవుడు ఒప్పుకోర‌ని అవినాష్ త‌న అక్క‌ల్ని హెచ్చ‌రించారు.

Readmore!

Show comments