చంద్రబాబు గాలి తీసేసిన పెయిడ్ ఆర్టిస్ట్

పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి నాటకాలు ఆడటం, వాటిని రక్తి కట్టించడం టీడీపీ వారికి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ దగ్గర ఎంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లున్నారనే విషయం బైటపడుతోంది. తాజాగా ఓ పెయిడ్ ఆర్టిస్ట్ ని చంద్రబాబు ఏకంగా తన ప్రెస్ మీట్ కి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అయితే పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో ఆ మహిళా ఆర్టిస్ట్ బాబుగారి గాలి తీసేసింది.

గుడివాడలో ఉల్లిపాయల కోసం వెళ్లి ఓ వ్యక్తి చనిపోయాడంటూ శవరాజకీయం చేయాలని చూశారు చంద్రబాబు. అయితే గుడివాడ ఎమ్మెల్యే నాని.. బాబు నాటకాన్ని బట్టబయలు చేశారు. సహజ మరణాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని, శవ రాజకీయం చేస్తున్నారని వీడియో సాక్ష్యం కూడా బైటపెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ లు కూడా బాధిత కుటుంబంతో బేరాలాడబోతున్నారని చెప్పారు.

దీంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈరోజు అసెంబ్లీ అయిపోగానే యథావిధిగా ప్రెస్ మీట్ పెట్టి మరో నాటకానికి తెరతీశారు. ఆ రోజు ఉల్లిపాయల కోసం వెళ్లి ఓ వ్యక్తి చనిపోయారని, దానికి ప్రత్యక్ష సాక్షి ఈ మహిళేనంటూ ఒకావిడను తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. అయితే ఆమె నిజాల్ని నిజాయితీగా చెప్పేయడంతో షాక్ అవ్వడం చంద్రబాబు వంతయింది.

ఆరోజు ఉల్లిపాయల కోసం తానూ రైతుబజార్ కి వెళ్లానని, తనతో పాటు వచ్చిన ఓ వ్యక్తి పక్కన పడిపోయాడని, అయితే ఆయనా, సదరు టీడీపీ నేతలు చెబుతున్న వ్యక్తీ ఒకరో కాదో తనకు తెలియదనీ, ఆయన పేరుకూడా తెలియదని, అసలాయన చనిపోయాడని కూడా తనకు తెలియదనీ ఉన్నదున్నట్టు చెప్పేసింది ఆవిడ.

దీంతో బాబుగారు ఖంగుతిన్నారు. ఆవిడ మాటల తాత్పర్యం ఇదీ అంటూ తను సర్దిచెప్పబోయారు. అంతలో అక్కడున్న మీడియా సిబ్బందికి విషయం అర్థమైంది. ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ అని, అయితే ట్రైనింగ్ సరిగాలేక అసలు విషయం చెప్పేసిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

దీంతో బాబుగారు హడావిడిగా ప్రెస్ మీట్ ముగించేసి, యథావిధిగా వైసీపీ నాయకులపై ధ్వజమెత్తి సైలెంట్ గా జారుకున్నారు. ఆవిధంగా ఆ పెయిడ్ ఆర్టిస్ట్ చంద్రబాబు గాలి తీసేసింది. 
 
 

Show comments