ఆల్ మోస్ట్ ఫైనల్: పోటీ నుంచి తప్పుకున్న నితిన్?

ఆగస్ట్ 11కు త్రిముఖ పోటీ తప్పదనుకున్నాం. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి, నితిన్ నటించిన లై, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయజానకి నాయక సినిమాలు మూడూ బరిలో నిలిచాయి. వీటిలో మొన్నటివరకు ఏ ఒక్కటి తగ్గలేదు. దాదాపు మూడు వచ్చేస్తాయని అనుకున్నారంతా. కానీ తాజా సమాచారం ప్రకారం రేసు నుంచి నితిన్ 
తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది లై. ఇలాంటి సినిమాను గట్టి కాంపిటిషన్ మధ్య విడుదల చేస్తే థియేటర్లు తగ్గి, భారీ వసూళ్లు సాధించడం కష్టమవుతుందని భావిస్తోంది యూనిట్. మరీ ముఖ్యంగా బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే పోటీ నుంచి తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్నారు. అందుకే తమ చిత్రాన్ని వాయిదా వేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు మరో 2-3 రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

నిజానికి ఆగస్ట్ 11 నుంచి రానా తప్పుకుంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి అప్పుడప్పుడు ఆఖరి నిమిషంలో డ్రాప్ అవుతుంటాడు నిర్మాత సురేష్ బాబు. ఈసారి కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమాను తమిళ్ లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. సో.. చెప్పిన తేదీ నుంచి తగ్గితే మొదటికే మోసం వస్తుంది.

ఇక జయజానకి నాయక విషయానికొస్తే, ఈ సినిమా రిలీజ్ పై బోయపాటి పంతంతో ఉన్నారు. పంద్రాగస్టు కలిసొస్తోంది కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లో సినిమా విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టాడట బోయపాటి. సో.. కొన్ని థియేటర్లు తగ్గినా జయజానకి రిలీజ్ అవ్వడం గ్యారెంటీ. ఈ పరిస్థితుల మధ్య తను తప్పుకోవడమే బెటర్ అని భావించాడు నితిన్.

Show comments