నీతులు చెప్పేందుకే.. జ‌న‌సేన మ‌ద్యం ప‌ట్టివేత‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నీతులు కోట‌లు దాటుతుంటాయి. గ‌తంలో ఆయ‌న జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ గురించి ఓయ‌బ్బా చాలా చాలా హిత‌బోధ‌న‌లు చేశారు. అలాగే వైసీపీ ఓట్ల కోసం మ‌ద్యం, డ‌బ్బు పంపిణీ చేస్తోంద‌ని ప‌లుమార్లు ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శించారు. మ‌రి ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు చేస్తున్న‌దేంటి? మ‌ద్యం, డ‌బ్బు య‌థేచ్ఛ‌గా పంపిణీ చేస్తున్నారు.

దొరికితే దొంగ‌, లేదంటే దొర అనే రీతిలో జ‌న‌సేన వ్య‌వ‌హారం వుంది. తాజాగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేస్తున్న అభ్య‌ర్థికి సంబంధించి ఏకంగా మ‌ద్యం కంటైన‌రే పోలీసులు ప‌ట్టుబ‌డింది. బంగారుపాళ్యం వ‌ద్ద కంటైన‌ర్‌పై అనుమానం వ‌చ్చి, పోలీసులు త‌నిఖీ చేయ‌గా భారీ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. దీని విలువ రూ.కోటి ఉంటుంద‌ని అన‌ధికారిక స‌మాచారం.

ప‌ట్టుబ‌డిన కంటైన‌ర్ డ్రైవ‌ర్‌, స‌ర‌ఫ‌రాదారుల వివ‌రాల మేర‌కు... జ‌న‌సేన అభ్య‌ర్థికి సంబంధించిన మ‌ద్యం అని పోలీసులు తెలిపారు. ఈ విష‌యం తెలిసి చిత్తూరు ఎస్పీ అక్క‌డికి వెళుతున్నార‌ని స‌మాచారం. మ‌ద్యం ఎవ‌రిది? ఎక్క‌డికి త‌ర‌లిస్తున్నార‌నే వివ‌రాల‌ను ఎస్పీ వెల్ల‌డించే అవ‌కాశాలున్నాయ‌ని పోలీసులు తెలిపారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌విత్ర పుణ్య‌కేత్రంలో ఓట‌ర్ల‌కు మ‌ద్యం పంపిణీ చేసేందుకు త‌ర‌లిస్తున్నట్టు పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

Readmore!

Show comments