10న ‘మెగా’ ‘చంద్ర’ కలయిక ?

2024 ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఓ అపూర్వ ఘట్టం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ట్రంప్ కార్డ్ మాదిరిగా దీన్ని తెలుగుదేశం- జనసేన కూటమి వాడబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 10న మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వెళ్తారని తెలుస్తోంది. ఆ రాత్రి అక్కడి నోవాటెల్ లో బసచేసి, మర్నాడు ఉదయాన్నే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కలస్తారని తెలుస్తోంది.  

చిరంజీవి అపూర్వ స్వాగతం పలకడం ద్వారా చంద్రబాబు నాయుడు మెగాభిమానుల మనసులు చూరగొనే విధంగా కార్యక్రమం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసే ఆహ్వాన స్వాగత సత్కారాలు బహుళ ప్రచారం జరిగేలా ప్లాన్ చేస్తన్నారని తెలుస్తోంది. అదే సమయంలో జగన్ ను కలిసినపుడు చేతులు జోడించిన విజువల్స్ కూడా ప్రచారానికి నోచుకోవచ్చు.

ఇదిలా వుంటే అదే రోజు విజయవాడలో ప్రతినిధి 2 సినిమా సెలబ్రిటీ షో వుండొచ్చు. దానికి మెగాస్టార్ హాజరయ్యే అవకాశం వుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ వుండొచ్చు. జై జనసేన అని మీరు అనరెందుకు అనే ప్రశ్న ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ కు ఎదురయ్యే ప్రణాళిక కూడా వుంటుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అప్పుడు జై జనసేన అని అనడం ద్వారా మెగాస్టార్ తన పూర్తి మద్దతును ప్రకటిస్తారని తెలస్తోంది.

ఇక మిగిలింది పిఠాపురం వెళ్లడం మాత్రమే. అది సమయం వుంటే కుదురుతుంది. లేదంటే లేదు. ఇదిలా ఉండగా... మెగాస్టార్ కు విజయవాడ.. పిఠాపురం వెళ్లే ప్లానింగ్ ఏమి లేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు

Readmore!

Show comments