బాప్ రే.. తొమ్మిది వందల కోట్ల ఆస్తితో జనసేన అభ్యర్ధి !

ఆమె ఎవరో పెద్దగా ఈ మధ్య దాకా తెలియదు. కానీ జనసేన తరఫున ఆమెకు నెల్లిమర్ల టికెట్ దక్కడం, కూటమిలో అది కొంత చిచ్చు పెట్టడంతో ఎవరు ఆమె అని ఆరా తీయడం మొదలెట్టారు. ఆమె ఆగర్భ శ్రీమంతురాలు అని నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

ఆమె విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్ధి లోకం మాధవి. ఆమె అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్ధిగా రికార్డులకు ఎక్కారు. ఇంకా చెప్పాలంటే నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఆస్తులు ఏడు వందల యాభై కోట్లు అయితే అవి దాటేసి మరీ తన ఆస్తులు 894.92 గా చూపించడంతో లోకం మాధవి ఈజ్ గ్రేట్ అనిపించేలా చేసింది.

లోకం మాధవి ఉన్నత విద్యావంతురాలు. ఆమె విదేశాల్లో ఉద్యోగం చేశారు. ఆమె భర్త లోకం ప్రసాద్ తో కలసి మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ అమెరికాలో ఉందని చెబుతున్నారు. అదే కంపెనీని  ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడికక్కడ పెట్టారు.  ఇలా తన కంపెనీలతో లోకం మాధవి మంచి ఆస్తిపరురాలిగా మారారు.

ఆమె అఫిడవిట్ లో పేర్కొన్న అస్తులు చూసిన వారు లోకం మాధవి అసామాన్యురాలు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ టీడీపీలలో కోటీశ్వరులు ఉన్నారు. కానీ వారిని మించి ఆస్తులు కలిగిన నేతగా అందులో మహిళగా లోకం మాధవి ఒక రేంజిలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమెని ఎన్నారై అని వైసీపీ నేతలు అంటున్నారు.

తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటానని కూడా వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ప్రచారంలో చెప్పారు. అయితే ఆమె ఆస్తులను చూసిన తరువాత ఆమె ధీటైన అభ్యర్ధిగానే ఉన్నారు అని అంటున్నారు.

Show comments