బియ్యపు జన ప్రభంజనం

శ్రీకాళహస్తిలో విజయోత్సవ ర్యాలీని తలపించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ ర్యాలీ. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే. 

నామినేష‌న్ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల అప్పుడే శ్రీకాళహస్తికి వచ్చే నాయకుడు కావాలా?? ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీలో ఒకరిగా ఉంటూ మీకు సేవ చేసే మధుసూదన్ రెడ్డి కావాలా?? అని నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

సోషల్ మీడియా ద్వారా శ్రీకాళహస్తి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న టిడిపి నాయకులకు మే 13వ తేదీన ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పనున్నారు. 2019లో మీ బిక్షతో గెలిచాను, కరోనా కష్టకాలంలో నా ప్రాణాలను పణంగా పెట్టి మీకు సేవ చేశాను, నేడు మీఅందరి ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తున్నాను అంటూ వేడుకున్నారు.  

ముందుగా తన నివాసం నుండి బయల్దేరి అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకున్నా అనంతరం శ్రీరామ నగర్ కాలనీలో వెలసిన శ్రీ విజయ గణపతి స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నాలుగు మాడవీధుల్లో ప్రజలకు అభివందనం చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

 

Show comments