నవంబర్ 11న ‘మారేడుమిల్లి’

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఎఆర్ మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ సినిమా విడుదల డేట్ ను నవంబర్ 11 కు ఫిక్స్ చేసారు. ఎన్నికల ఆఫీసర్ గా అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా అది. కామెడీ పాత్రల నుంచి మెలమెల్లగా పక్కకు జరుగుతూ వస్తున్న నరేష్ ఈసారి ప్రభుత్వ అధికారి పాత్రను ట్రయ్ చేస్తున్నారు. 

గిరిజన ప్రాంతంలో ఎన్నికల అధికారికి ఎదురైన సమస్యలు, పరిష్కారం ఇలాంటివి డిస్కస్ చేసినట్లు కనిపిస్తోంది. అసలు మారేడుమిల్లి ప్రజలు ఏమని విన్నవించుకున్నారు. అక్కడేం జరిగింది అన్నది స్టోరీ.

విడుదల డేట్ తో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అందులో గిరిజన ప్రాంతంలోకి హీరో, అతని టీమ్, ఎస్కార్డ్ బృందం వెళ్తున్న షాట్ క్లిక్ వుంది. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం.

నాంది తరువాత మారేడుమిల్లి సినిమా చేస్తున్న అల్లరి నరేష్ దీని తరువాత మళ్లీ నాంది దర్శకుడితోనే మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. సాహు గారపాటి దీనికి నిర్మాత.

Show comments