సూప‌ర్‌స్టార్ స‌తీమ‌ణి క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో వ‌రుష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణం నుంచి తేరుకోకుండానే, సూప‌ర్‌స్టార్ కృష్ణ స‌తీమ‌ణి ఇందిరాదేవి క‌న్నుమూశారు. కొంత‌కాలంగా ఇందిరాదేవి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఇవాళ హైద‌రాబాద్‌లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, ఇందిరాదేవి దంప‌తులకు మొత్తం ఐదుగురు సంతానం. వారి పిల్ల‌లు ర‌మేశ్‌బాబు, మ‌హేశ్‌బాబు, కుమార్తెలు ప‌ద్మావ‌తి, మంజుల‌, ప్రియ‌ద‌ర్శిని. ఇటీవ‌ల పెద్ద కుమారుడు ర‌మేశ్‌బాబు అనారోగ్యంతో చ‌నిపోయారు. ఇత‌ను కూడా కొంత కాలం సినిమాల్లో న‌టించారు. మ‌హేశ్‌బాబు టాలీవుడ్ టాప్‌హీరోల్లో ఒక‌డు.

కుమార్తె ప‌ద్మావ‌తి భ‌ర్త టీడీపీ నాయ‌కుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌. ఇటీవ‌ల వీరి కుమారుడు కూడా టాలీవుడ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. మ‌రో కుమార్తె మంజుల కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లో వుంటున్నారు.  మ‌హేశ్‌బాబు త‌ల్లి మ‌ర‌ణ‌వార్త‌తో టాలీవుడ్‌లో విషాదం నెల‌కుంది. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఇందిరాదేవి మృతికి సంతాపం తెలిపారు. 

Show comments