పవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్?

నిజజీవితంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు సాయితేజ్. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆ యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఈ హీరో, ఇప్పుడిప్పుడే తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి కొత్త సినిమా కూడా స్టార్ట్ చేశాడు.

పవన్-సాయితేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో యాక్సిడెంట్ సీన్ ఉంది. నిజజీవితంలో పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడిన సాయితేజ్, ఇప్పుడీ సినిమాలో సరిగ్గా అలాంటి యాక్సిడెంట్ కే గురవుతాడు. 

నిజజీవితంలో ప్రాణాపాయం తప్పింది, సినిమాలో మాత్రం ప్రాణం పోతుంది. అప్పుడే భగవంతుడు పవన్ కల్యాణ్ రూపంలో వస్తాడు. సాయితేజ్ కు సెకెండ్ ఛాన్స్ ఇస్తాడు. ఇలా నిజజీవితంలో జరిగిన యాక్సిడెంట్ ను సినిమాలో కూడా పెట్టారు.

ఇదేదో గాసిప్ కాదు. వినోదాయ శితం సినిమాలో ఇదే ఉంది. దాదాపు ఇదే సీన్ ను ఈ రీమేక్ లో కూడా రిపీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కథకు చాలా మార్పుచేర్పులు చేసిన త్రివిక్రమ్, కీలకమైన ఈ సన్నివేశాన్ని మాత్రం యాజ్ ఇటీజ్ గా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో కారుకు యాక్సిడెంట్ అవుతుంది. రీమేక్ లో మాత్రం సాయితేజ్ కు బైక్ యాక్సిడెంట్ అయినట్టు చూపిస్తారట. 

భీమ్లానాయక్ టైపులో ఈ సినిమాకు త్రివిక్రమ్ తన పేరు వేసుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. స్క్రిప్ట్, డైలాగ్స్ ఇతడే పూర్తిచేశాడు. తన భార్యను నిర్మాణ భాగస్వామిగా చేర్చాడు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

Show comments