పూరి సినిమాలో జాహ్నవి

శ్రీదేవి కుమార్తెగానే కాదు, సోషల్ మీడియా పోస్టులతో కూడా బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవికి చాలా పాపులారిటీనే వుంది. జాహ్నవిని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన చాలా మందికి వుంది. కానీ అది ఎందుకో వర్కవుట్ కావడం లేదు.

ఎన్టీఆర్ సరసన జాహ్నవి నటిస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ నిజం కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాధ్ జాహ్నవిని తన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాద్. మరో సినిమాను అదే హీరోతో చేయబోతున్నారు. ఆ సినిమా ఒకటి రెండు నెలల్లో మొదలవుతుంది. రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవిని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాటలు జరిగాయని, అంతా ఓకె అయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎలాగూ తెలుగు-హిందీ బాషల్లో తయారవుతుంది కనుక, ఆ విధంగా జాహ్నవి తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్లే.

Show comments