బాబు హిందువేనా?

సిఎమ్ వైఎస్ హిందువు కాదు అని చెప్పడానికి తెలుగుదేశం మద్దతు జ‌నాలు సదా కష్టపడుతూ వుంటారు. సందు దొరికితే చాలు జ‌గన్ క్రిస్టియన్ అని చాటడానికి ట్రయ్ చేస్తుంటారు. 

కానీ నిజానికి జ‌గన్ అన్ని మతధర్మాలను సమానంగా ఆచరిస్తూ వస్తున్నారు. కాలినడకన తిరుపతికి వెళ్తారు. గంగ లో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. స్వామీజీలను కలుస్తారు. సమాదరిస్తారు. ఆఖరికి ఇప్పుడు ఇంటి దగ్గర అందమైన గోశాల నిర్మింపచేసుకున్నారు.

జ‌నసేన నాయకుడు పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్. ఆయన ఆ విషయమేం దాచరు. పవన్ వెంకన్న సన్నిధికి కాలి నడకన వెళ్తారు. ఆంధ్రలోని ఇంట్లో, హైదరాబాద్ ఫార్మ్ హవుస్ లోనూ ఆవులను పెంచుకుంటున్నారు.

చంద్రబాబు సంగతికి వస్తే ఆయన ఇంటి దగ్గర ఓ గోవు వున్న దాఖలా లేదు. ఇంటి పక్కన ఓ పేద్ద హాలు కట్టి మీటింగ్ లు పెట్టాలని చూసారు కానీ చిన్న పందిరి వేసి ఓ ఆవును. దూడను పెంచిన దాఖలా లేదు. గంగలో మునిగిన ఫోటో లేదు. గోదావరి పుణ్య స్నానాన్ని కూడా భారీ పబ్లిసిటీకి వాడాలని చూసారు.

గమ్మత్తేమిటంటే జ‌గన్ ను హిందువు కాదని చాటాలనుకునేవారు ఇప్పుడు గోశాల నిర్మిస్తే అక్కడ కూడా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. తాను ఫలానా అని చెప్పుకుంటే సరిపోదు. దాన్ని ఆచరించగలగాలి. ఆ విషయంలో జ‌గన్ సైలంట్ గా హిందువుల మనసు చూరగొంటున్నారు. 

జ‌గన్ క్రిస్ట్రియన్ అని చాటడం వల్ల చంద్రబాబు వాళ్లకి దూరం అవుతున్నారు. 

Show comments