నేను ఇంకా బ‌తికే ఉన్నాః ప్ర‌ముఖ న‌టి

అదృష్ట‌వ‌శాత్తు తానింకా బ‌తికే ఉన్న‌ట్టు ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి శిల్పాశెట్టి చెప్పారు. ఇటీవ‌ల త‌న భ‌ర్త , వ్యాపార‌వేత్త అయిన రాజ్‌కుంద్రా ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో అరెస్ట్ అయ్యారు. 

ఈ నేప‌థ్యంలో శిల్పాశెట్టి మొద‌టిసారిగా త‌న‌దైన స్టైల్‌లో సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఒక‌వైపు త‌న భ‌ర్త అరెస్ట్‌పై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే, జీవితంలో ఇలాంటివి త‌న‌కు కొత్త కాద‌ని శిల్పాశెట్టి చెప్ప‌డం కొస‌మెరుపు.

త‌న భ‌ర్త అరెస్ట్‌పై స్పందించేందుకు ఆమె ప్ర‌ముఖ ర‌చ‌యిత జేమ్స్ థ‌ర్బ‌ర్ న‌వ‌ల‌లోని ఓ పేరాని తీసుకుని హైలైట్ చేశారు. శిల్పాశెట్టి పెట్టిన‌ ఆ పోస్టు ఏంటంటే...

‘గట్టిగా ఊపిరిపీల్చుకోవడంతో.. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసింది. గతంలో సవాళ్లు తట్టుకున్నాను.. అదే మాదిరిగా భవిష్యత్తులోనూ సవాళ్ల ఎదుర్కొంటాను. ఏం జరిగినా, నా జీవితాన్ని నేను జీవిస్తాను. దాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆమె ఆమె చెప్పుకొచ్చారు. 

కానీ త‌న భ‌ర్త ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో ఇరుక్కోవ‌డంపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. భ‌ర్త కేసులో ఇరుక్కున్న ప‌రిస్థితుల్లో త‌న మాన‌సిక స్థితి గురించి మాత్ర‌మే ఆమె వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా శిల్పాశెట్టి పోస్టుపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మెజార్టీ నెటిజ‌న్లు మాత్రం శిల్పాశెట్టి భ‌ర్త వ్య‌వ‌హారాన్ని త‌ప్పు ప‌డుతుండ‌డం విశేషం.

Show comments