మైత్రీ ఆశలపై దిల్ రాజు నీళ్లు

సినిమా రంగం అంటేనే కాంపిటీషన్. ఎవరు డేట్ లు దొరకబుచ్చుకుంటే వారిదే సినిమా. ముఖ్యంగా క్రేజీ కాంబినేన్లు సెట్ చేసుకోవాలంటే కేవలం డబ్బు వుంటే చాలదు. అన్నీ వుండి కూడా ప్రయత్నాలు చేయడంలో కీలకంగా వ్యవహారించాలి. 

తమిళ సూపర్ స్టార్ విజయ్ తో తెలుగు సినిమా చేయాలని మైత్రీ సంస్థ ఎప్పటి నుంచో అనుకుంటోంది. ప్రయత్నాలు చేస్తున్నట్లు, చేద్దాం అన్నట్లు నడుస్తోంది.

ఇలాంటి టైమ్ లో సర్రున దూసుకుపోయారు నిర్మాత దిల్ రాజు. విజయ్ మేనేజర్ తో నిత్యం టచ్ లో వుండి, చెన్నయ్ వెళ్లి వస్తూ, చటుక్కున విజయ్ డేట్ లు పట్టేసారు. ఈ విషయం ఎక్కడ బయటికి వస్తే మైత్రీ సంస్థ అప్రమత్తం అయిపోతుందో అని వీలయినంత సీక్రెట్ గా కార్యక్రమం కానిచ్చారు.

ఆఖరికి విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక బయటకు ఫీలర్లు వదిలారు. కరోనా టైమ్ లో ఆర్భాటంగా ప్రకటించే బదులు, లీక్ ఇస్తే బెటర్ అని ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది. 

మొత్తానికి మైత్రీ మూవీస్ అనుకున్నది దిల్ రాజు వర్కవుట్ చేసారు. మళ్లీ ఇప్పట్లో మైత్రీకి అవకాశం రాదు. ఎందుకంటే తమిళ సినిమాలు కనీసం రెండు మూడు చేసాక కానీ తెలుగు సినిమా చేయడు కదా.

Show comments