సబ్బం హరిని అలా వదిలేశారేంటో...?

విశాఖ ఆక్టోపస్ గా పేరు గడించిన సబ్బం హరి తెలుగుదేశానికి పెద్ద గొంతుకగా మారిన సంగతి తెలిసిందే. జగన్ తో కొన్నాళ్ళు హరి నెరపిన సాన్నిహిత్యాన్ని టీడీపీ వాడుకుంటూ ఆయన జగన్ గురించి చెబితే జనం నమ్ముతారని బాగా ప్రోత్సహించిన సంగతి కూడా ఎరుకే.

హరి సైతం టీడీపీ అనుకూల చానళ్ళకు రాజకీయ విశ్లేషకుడిగా మారి వైసీపీ మీద జగన్ మీద ఎప్పటికపుడు ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో హరికి భీమిలీ నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన ఓడిపోయారు.

ఆ తరువాత హరి చంద్రబాబుని పొగుడుతూ మళ్ళీ ఆయనే సీఎం కావాలని ప్రతీ చోటా చెప్పుకుని వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆది నుంచి టీడీపీలో ఉన్న తమ్ముళ్ళ కన్నా కూడా ఎక్కువగానే హరి బాబుని మెచ్చుకుంటూ వచ్చారు.

కానీ ఇటీవల పంచిన పార్టీ పదవుల్లో హరికి కనీసం పొలిటి బ్యూరో మెంబర్ కూడా ఇవ్వలేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారుట. పార్టీ కోసం గట్టిగా మాట్లాడుతున్న హరి వంటి నేతను గుర్తించకపోవడం బాధాకరమే. 

విశాఖను రాజధానిగా చేయవద్దు అని మొదట గొంతు ఎత్తింది కూడా హరే. మరి ఆయనకు పార్టీలో పెద్ద పీట వేయకపోవడంపైన చర్చ   జరుగుతోంది. అందరి మాదిరిగానే హరిని కూడా వాడుకుని వదిలేశారా అన్న డౌట్లు అయితే ఆయన అనుచరుల్లో గట్టిగానే కొడుతున్నాయట.

ఎన్టీఆర్ ఆజ్ఞాతవాసం ఈ టోపీతోనే

Show comments