పాపం..మైత్రీ మూవీస్

రంగస్థలం సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ మైత్రీ మూవీస్ కు పర్మనెంట్ డైరక్టర్ అయిపోయారు. అలా అనే తరచు వార్తలు వినిపించాయి. సుకుమార్ ఆలన, పాలన అన్నీ మైత్రీ మూవీస్ నే చూసుకునేలా వ్యవహారాలు నడిచాయి. అందుకు తగినట్లే అక్కడే బన్నీతో పుష్ప సినిమా ప్లాన్ చేసారు. అలాగే ఆయన పర్యవేక్షణలోనే ఉప్పెన సినిమా ప్లాన్ చేసారు. 

హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా మైత్రీకి ఇక సుకుమార్ వుంటారని, దాని వల్ల ప్రతి ఏటా ఒక సుకుమార్ కాంబోలో పెద్ద సినిమా వుంటుందని అనుకున్నారు. ఓ పెద్ద డైరక్టర్ పర్మనెంట్ గా సంస్థలో వుంటే వచ్చే అడ్వాంటేజ్ లు అన్నీ వస్తాయనుకున్నారు. కానీ సుకుమార్ తన తరువాత సినిమాను వేరే బ్యానర్ లో ప్రకటించారు.

హీరో బన్నీ స్నేహితుడు, సన్నిహితుడు, భాగస్వామి అయిన కేదార్ నిర్మాతగా సుకుమార్ 2022 లో (ఇంకా చాలా దూరం వుంది)లో సినిమా చేస్తారని ప్రకటించారు. అంటే పుష్ప సినిమా తరువాత మైత్రీలో సుకుమార్ సినిమా లేనట్లే అన్నమాట. తివిక్రమ్ మాదిరిగా ఓ బ్యానర్ కు అంత లాయల్ గా ఎవరూ వుండలేరేమో?

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

Show comments