సుకుమార్ పంతమే నెగ్గింది

పుష్ప సినిమా అటవీ ప్రాంత షూటింగ్ కు కేరళనె వెళ్లాం అంటున్నారు దర్శకుడు సుకుమార్ అంటూ ఈనెల మొదటి వారంలోనే వెల్లడించాం. ఎలాగూ ఇంత ఆలస్యం అయింది ఇక తెలంగాణ వికారాబాద్, లేదా ఆంధ్ర రంపచోడవరం అడవులతో సరిపెట్టుకోవడం ఎందుకు, మళ్లీ కేరళకే వెళ్తాము అన్నది సుకుమార్ పాయింట్. అది కరెక్టే కూడా. కరోనాకు ముందు రెక్కీచేసి, అంతా ప్లాన్ చేసింది కేరళ నేపథ్యంలోనే. 

పైగా ఆ బ్యాక్ డ్రాప్ తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా వుండే అవకాశం వుంది.అదీ కాక బన్నీకి వున్న మలయాళీ ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహంగా వుంటుంది. అందుకే అన్ని విధాలా కేరళలో షూట్ చేయడానికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూలింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా సమ్మర్ విడుదల టార్గెట్ గా పెట్టుకుంది. ఏప్రియల్ లో మెగాస్టార్ ఆచార్య విడుదల ప్లాన్ చేస్తున్నారు. మే లేదా జూన్ కు పుష్ప రెడీ కావాల్సి వుంటుంది. ఈ సినిమా కోసం బన్నీ డిఫరెంట్ మేకవర్ తో రెడీ అయి వున్నారు కూడా. 

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా 

Show comments