కరణం మల్లీశ్వరిగా రకుల్?

కరణం మల్లీశ్వరి బయోపిక్ ప్రకటన వచ్చేసింది. రచయిత, దర్శకుడు, నిర్మాత, కోనవెంకట్ ఈ ప్రాజెక్టును పలువురితో కలిసి పాన్ ఇండియా సినిమాగా చేయబోతున్నారు.  అయితే ఇంతకీ కరణం మల్లీశ్వరి పాత్ర ఎవరు చేయబోతున్నారు. ఈ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. నార్త్ ఇండియా జనాలకు కూడా పరిచయం వున్న నటిని తీసుకోవాలనుకుంటున్నారని వార్తలు వినిపించాయి. 

కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ వేరుగా వుంది. రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకునే ఆలోచన చేస్తున్నారని వినిపిస్తోంది. ఫిట్ నెస్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా శ్రద్ధగా వుంటుంది. ఆమెకు స్వంత ఫిట్ నెస్ సెంటర్లు కూడా వున్నాయి. హెవీ వర్కవుట్ లు కూడా రకుల్ చేస్తుందని గతంలోనే అనేక విడియోలు, స్టిల్స్ వెల్లడి చేసాయి.

ఈ నేపథ్యంలో రకుల్ ను కరణం మల్లీశ్వరి పాత్రకు తీసుకుంటే, అన్ని విధాల బాగుంటుందనే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఆలోచనే ఫైనల్ నా? ఇంకేవైనా ఆప్షన్లు వున్నాయా? అసలు రకుల్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

Show comments