'సర్కారు వారి పాట' మొదలు

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు చేసే సినిమా మీద ఇన్నాళ్లు వున్న ఊహాగానాలకు ఇక ఫుల్ స్టాప్ పడింది. డైరక్టర్ పరుశురామ్ తో కలిసి మహేష్ బాబు చేయబోయే 'సర్కారువారి పాట' అనౌన్స్ మెంట్ వచ్చేసింది.  మైత్రీ మూవీస్, 14 రీల్స్ కలిసి జిఎమ్ బి తో ఈ సినిమాను నిర్మిస్తారు. థమన్ సంగీతం అందిస్తారు. ఈ మేరకు వదిలిన ఫస్ట్ లుక్ లో మహేష్ ను వెనక నుంచి చూపించారు. మెడపై రూపాయి కాసు ను టట్టూగా వేసారు. చెవికి పోగు పెట్టారు. 

సరిలేరు నీకెవ్వరు సినిమా తరవాత ఏ సినిమా చేయాలి అన్నది ఓ పట్టాన తేలలేదు. ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. మరోపక్క డైరక్టర్ పరుశురామ్ 14రీల్స్ ప్లస్ పతాకంపై  నాగ్ చైతన్య సినిమా మీదకు వెళ్లిపోయారు. అది పక్కన పెట్టడంతో, 14రీల్స్ బ్యానర్ కూడా రంగంలోకి వచ్చింది. 

ఆ విధంగా మళ్లీ మహర్షి సినిమా మాదిరిగా మూడు బ్యానర్లు కలిసి ఈ సర్కారువారి పాటను నిర్వహిస్తాయి. హీరోయిన్ వేట సాగుతోంది. పూజా హెగ్డే పేరు లైన్ లో వుంది.

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments