ఏపీలో కొత్తగా మరో 68 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో రోజూ పదులు సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 68 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2787కు చేరింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 9664 శాంపిల్స్ ను పరీక్షించిన అధికారులు.. అందులో 68 పాజిటివ్స్ ఉన్నట్టు నిర్థారించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లా నుంచి 8 మంది, చిత్తూరు నుంచి ఒక్కరు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చారు. ఇక గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు.

మొత్తం 2787 కేసుల్లో ఇప్పటివరకు 1913 మంది డిశ్చార్జ్ అయ్యారు. 58 మంది మరణించారు. 816 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లు 111 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు 219 మంది ఉన్నారు.

సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు

Show comments