ఇన్ స్టాలో సమంత క్రేజ్.. కోటికి చేరింది!

ఇన్ స్టాగ్ర‌మ్ లో ప‌ది మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్ల‌ను సంపాదించిన భార‌తీయ సెల‌బ్రిటీల జాబితాలో చేరింది న‌టి స‌మంత‌. ప్ర‌స్తుతం సెల‌బ్రిటీల‌కు బాగా యాక్టివ్ గా ఉంటున్న చోటు ఇన్ స్టాగ్ర‌మ్. ఈ ఫొటో షేరింగ్ వెబ్ సైట్ పై యువ‌త కూడా బాగా దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ యాక్టివిటీస్ గ‌ట్టిగా ఉంటున్నాయి. 

ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు అక్క‌డ మిలియ‌న్ల ఫాలోయ‌ర్ల స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈ క్ర‌మంలో స‌మంత ప‌ది మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఇది చెప్పుకోద‌గిన ఫీటే. ఈ క్ర‌మంలో సమంత కూడా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ప‌ది మిలియ‌న్ల ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకున్న ఉత్సాహాన్ని చాటుకుంటూ.. ఈ సంద‌ర్భంగా త‌ను చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాన్ని కూడా స‌మంత వివ‌రించింది.

ప‌ది మిలి‌య‌న్ల మంది ఫాలోయ‌ర్లు ద‌క్కినందుకు గానూ ప‌ది గొప్ప ఎన్జీవోల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందించ‌బోతున్న‌ట్టుగా స‌మంత ప్ర‌క‌టించింది. ఇలా త‌న ఆనందాన్ని సాయం చేయ‌డం ద్వారా సెల‌బ్రేట్ చేసుకుంటుంద‌ట స‌మంత‌. ఇన్ స్టాలో ఈమె త‌ర‌చూ త‌న భ‌ర్త, త‌ను దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మ‌ధ్య రాజా ర‌వి వ‌ర్మ పెయింటింగ్ త‌ర‌హాలో త‌ను పోజిస్తూ స‌మంత పోస్టు చేసిన ఫొటో బాగా వైర‌ల్ అయ్యింది. ఆ జాబితాలో వేరే న‌టీమ‌ణులు కూడా ఉన్నా, స‌మంత ఫొటోనే బాగా ఆక‌ట్టుకుంది. అలా ఇన్ స్టాలో స‌మంత ఫొటోలు వైర‌ల్ గా కొన‌సాగుతూ ఉన్నాయి.

మన పాలన-మీ సూచన, 2వ రోజు

Show comments