షూటింగ్స్‌కు భ‌య‌ప‌డుతున్న‌ ముద్దుగుమ్మ‌

లావ‌ణ్యత్రిపాఠి...అందాల తార‌. న‌ట‌న‌లో కృత్రిమ‌త్వం క‌నిపించ‌దు. త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు సుల‌భంగా న‌టిస్తూ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్నారామె. లాక్‌డౌన్ అనంత‌రం సినిమా షూటింగ్‌ల‌పై త‌న అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పారామె.  

లాక్‌డౌన్ కార‌ణంగా రెండు నెల‌లుగా షూటింగ్‌లు నిలిచిపోయాయ‌న్నారు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో తిరిగి షూటింగ్‌లు స్టార్ట్ చేస్తున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆమె సూచిస్తున్నారు. సందీప్‌కిష‌న్ స‌ర‌స‌న  ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో నటిస్తున్న లావ‌ణ్య...త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఆ సినిమా షూటింగ్ విష‌య‌మై కూడా మాట్లాడారు.

‘సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టాలంటే  భయంగానే ఉంది. ప్రొడక్షన్‌ టీమ్‌ ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకుంటుందో  చూడాలి.  షూటింగ్ స‌మ‌యంలో సెట్‌లో చాలా మంది ఉంటారు. అందులో ఒక్కరికి వ్యాధి లక్షణాలు కనిపించినా షూటింగ్‌ మొత్తం ప్రమా దంలో పడుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.

కథానుగుణంగా ఇంటిమేట్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి వస్తే మీరు అంగీకరిస్తారా అని అడగ్గా...‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండటమే మంచినదనుకుంటున్నా. అయితే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో  రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది’ అని పేర్కొంది. లావ‌ణ్య మాట‌ల‌ను బ‌ట్టి షూటింగ్‌లంటే ఒక‌వైపు భ‌య‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అయితే త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో అన్ని రంగాల‌తో పాటు సినిమా రంగం కూడా షూటింగ్‌ల బాట ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. 

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments