వీకెండ్ మస్తీ.. విదేశీయులు కూడా తగ్గట్లేదుగా!

వీకెండ్ వస్తే చాలు మందుబాబులు రెచ్చిపోతున్నారు. పేజ్ త్రీ భామలు కూడా అస్సలు తగ్గట్లేదు. ఎన్ని కేసులు నమోదవుతున్నా కొంతమంది తీరు మాత్రం మారడం లేదు. ఇప్పుడు వీళ్లకు విదేశీయులు కూడా తోడయ్యారు. హైదరాబాద్ లో రాత్రి విదేశీయులు వీరంగం వేశారు. తప్ప తాగి రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు.

శివరాత్రి అనే లెక్క కూడా లేకుండా రాత్రి మందుబాబులు హల్ చల్ చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రాత్రి 14 మందిని పోలీసులు బుక్ చేశారు. వీళ్లలో నలుగురు విదేశీయులు ఉండడం ఆశ్చర్యకరం. సూడాన్ దేశానికి చెందిన వీళ్లు తాగడమే కాకుండా, పోలీసులతో గొడవ పెట్టుకున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు నిరాకరించడంతో పాటు.. వీసా చూపించడానికి కూడా వాళ్లు ఇష్టపడలేదు. దీంతో పోలీసులంతా కలిసి రంగంలోకి దిగి వాళ్లను సోదా చేయగా, ఎవ్వరి వద్దా వీసాలు లేవనే విషయాన్ని గుర్తించారు. వెంటనే వాళ్లను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. తాగింది దిగిన తర్వాత ఈరోజు వాళ్లను ఎంక్వయిరీ చేస్తారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఘటన చోటుచేసుకుంటూనే ఉంటుంది. కొన్ని సార్లు సెలబ్రిటీలు దొరికితే, మరికొన్ని సార్లు మహిళలే తప్పతాగి అడ్డంగా బుక్కయిపోతున్నారు. ఇలా విదేశీయులు దొరకడం మాత్రం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

Show comments