చైతూ-సమంతను ఫాలో అవుతున్న కొత్త జంట

ఆర్య, సాయేషా మొన్ననే పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో పెద్ద రిసెప్షన్ కూడా ఇచ్చారు. ఇద్దరూ కలిసి హనీమూన్ కు ఏ దేశానికి వెళ్తారనే చర్చ కూడా కోలీవుడ్ లో జోరుగా సాగింది. కానీ రిసెప్షన్ ఇచ్చిన వెంటనే భార్యాభర్తలిద్దరూ బిజీ అయిపోయారు. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల్ని పూర్తిచేసే పనిలో పడ్డారు.

సాయేషా చేతిలో ఓ తమిళ సినిమా ఉండగా, ఆర్య 2 సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల్ని పూర్తిచేసే పనిలో వీళ్లిద్దరూ బిజీ అయిపోయారు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్లు రెస్ట్ తీసుకోవడం లేదు. కలిసి నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్య హీరోగా, సాయేషా హీరోయిన్ గా మూవీ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని కూడా వీళ్లు అధికారికంగా ప్రకటించారు.

గతంలో నాగచైతన్య, సమంత కూడా ఇంతే. పెళ్లయితే చేసుకున్నారు కానీ హనీమూన్ లాంటి వ్యవహారాల జోలికి పోలేదు. వెంటనే సినిమాలు స్టార్ట్ చేశారు. మధ్యమధ్యలో చిన్న చిన్న విదేశీ పర్యటనలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆర్య, సాయేషా కూడా ఇదే రూటులో ఉన్నారు. సినిమాలు చేస్తూనే గ్యాప్ దొరికితే హాలిడేస్ ప్లాన్ చేసుకుంటున్నారు.

అన్నట్టు పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని సాయేషా ప్రకటించింది. ఆమె సినిమాల్లో నటిస్తానంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆర్య కూడా తెలిపాడు. ఇక్కడ కూడా నాగచైతన్య-సమంత ఫార్ములానే ఫాలో అవుతోంది ఈ జంట.

Readmore!

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు

Show comments