ఏపీ పాలిటిక్స్‌పై నాయిని హాట్ కామెంట్!

ఏపీ పాలిటిక్స్ పై హాట్ కామెంట్స్ చేశాడు తెలంగాణ రాష్ట్రసమితి నేత నాయిని నర్సింహారెడ్డి. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నాయిని అభిప్రాయపడ్డాడు. ‘ఏపీలో వచ్చేది జగనే..’ అంటూ హాట్ కామెంట్ చేశాడు నర్సింహారెడ్డి. ఆ విషయం చంద్రబాబుకు కూడా అర్థం అయిపోయిందని, అందుకే బాబు ఇప్పుడు తెలంగాణ మీదపడ్డాడు అని అన్నాడీయన.

ఏపీలో పీఠం చేజారుతుందని బాబుకు భయం పట్టుకుందని, ఓడిపోయాకా ఎలాగూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో మకాం పెడతాడు అని, అందుకే చంద్రబాబు నాయుడు ఇక్కడ నాలుగైదు మంది ఎమ్మెల్యేలనైనా గెలిపించుకోవాలని అనుకుంటున్నాడని నాయిని వ్యాఖ్యానించాడు. సొంతంగా ఆ నాలుగైదు కూడా గెలవలేక చంద్రబాబు నాయుడు మహాకూటమి అంటున్నాడని ఈ సీనియర్ పొలిటీషియన్ వ్యాఖ్యానించాడు.

జగన్ గురించి చేసిన కామెంట్ సంగతెలా ఉన్నా, ఓడిపోయాకా చంద్రబాబు నాయుము మకాం హైదరాబాద్‌కు మార్చేస్తాడని నాయిని వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకమైన అంశమే. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కుటంబం హైదరాబాద్ లోనే కొనసాగుతూ ఉంది.

చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన భార్య, కోడలు మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అదేమంటే వారి వ్యాపార సామ్రాజ్యం అక్కడే ఉంది. ఒకవైపు ప్రపంచమంతా తిరిగి వ్యాపారస్తులను హైదరాబాద్ కు రమ్మంటాడు చంద్రబాబు.

ఆ మధ్య ముంబైకి వెళ్లి.. అక్కడి జనాలు కూడా అమరావతికి చేరాలని, ఇళ్లు కట్టుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చాడు. అయితే బాబు ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంది. వీకెండ్స్ లో బాబు, లోకేష్ అమరావతి వచ్చి వెళ్తున్నారు. మరి రేపు ఓడిపోతే బాబు కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతాడని కావొచ్చునేమో!

Show comments