కత్రినాకైఫ్ కు నయనతార సాయం!

చాలామంది నటీనటుల్లాగానే తన పేరు మీదా ఒక ఫ్యాషన్ బ్రాండ్ ను నెలకొల్పి వ్యాపారం మొదలుపెడుతోంది కత్రినాకైఫ్. ఈ క్రమంలో ఆమె 'కే బై  కత్రినా' పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండింగ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో రకరకాల సౌందర్య సంబంధ సామాగ్రి అమ్మకాలు సాగుతాయట. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రమోషన్ యాడ్స్ తో బిజీగా ఉందట కత్రినా కైఫ్.

ఇప్పటికే బాలీవుడ్ లో తన సన్నిహిత ప్రముఖుల సాయంతో వాటి ప్రమోషన్ యాడ్స్ ను రూపొందించుకుంటోందట ఈ హీరోయిన్. కేవలం బాలీవుడ్ వాళ్లతో మాత్రమే కాకుండా, సౌత్ సినీ స్టార్స్ తో కూడా తన బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలని కత్రినా నిర్ణయించుకుంది. 

ఈ మేరకు ఇక్కడి సెలబ్రిటీలతో ఆమె టచ్లోకి వచ్చి, వారితోనూ ప్రమోషన్ వీడియోలను రూపొందించుకుంటోంది. అలా కత్రినా కైఫ్ కు చూపు నయనతార మీద పడ్డట్టుగా తెలుస్తోంది. సౌతిండియా అంతా గుర్తింపు ఉన్న నటీమణుల్లో నయనతార ఇప్పుడు లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చేత తన బ్రాండ్ కు ఒక ప్రమోషన్ వీడియో చేయించుకుందట కత్రినా కైఫ్.

ఈ విషయాన్ని తనే ప్రకటించింది. తన బ్రాండ్ ప్రమోషన్ వీడియోలో కనిపించడానికి ముంబై వరకూ వెళ్లినందుకు గానూ నయనతారకు కృతజ్ఞతలు కూడా చెప్పింది కత్రినాకైఫ్.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments