ముసుగులో హీరో హీరోయిన్లు

ఫిదా సినిమా ముందు సీన్ వేరు. వెనుక సీన్ వేరు. ఫిదా విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజుకు ఆ సినిమా మీద అంత పాజిటివ్ అంచనా ఏదీ లేదన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ వర్గాలకు తెలిసిన సంగతి. అయితే సినిమా విడుదలయింది. బ్లాక్ బస్టర్ అయింది.

సినిమా ఇంత హిట్ కావడం వెనుక దర్శకుడు శేఖర్ కమ్ముల టాలెంట్ ఎంత వుందో? హీరోయిన్ సాయిపల్లవి గ్లామర్ కూడా అంతకు అంతా వుంది. ఆమె తన నటనతో, డ్యాన్స్ లతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. అదే సినిమాను కొత్త హీరోయిన్ తో తీసివుంటే ఎలా వుండేదో?

అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల మరోలా ఆలోచిస్తున్నారు. ఎప్పటిలాగే మళ్లీ తను ఓ కొత్త హీరోయిన్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. దాంతో పాటు కొత్త హీరో కూడా. ఇప్పటికే ఏషియన్ సునీల్ నిర్మాతగా సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూలు చురుగ్గా సాగుతోంది.

ఈ సినిమాకు కొత్త హీరో, హీరోయిన్ ను తీసుకున్నారు. కానీ వాళ్లు ఎవరో? ఎలా వుంటారో? ఎవరికీ తెలియచేయడం లేదు. నిర్మాత సునీల్ కు కూడా జస్ట్ ఒకసారి పరిచయం చేసారట. అంతే. యూనిట్ లో ఎవరూ షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్ లు వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీఆర్వోను సైతం సెల్ ఫోన్ బయటపెట్టి లోపలకు రమ్మంటున్నారట.

ఇవ్వాళ రేపు జనాలు కాంబినేషన్ చూస్తున్నారు. బ్యానర్, డైరక్టర్, హీరో, హీరోయిన్ ఇలా అన్నీకలిసి చూసి, సినిమాల మీద అంచనా పెంచుకుంటున్నారు. అప్పుడే ఓపెనింగ్స్ వస్తున్నాయి. లేదూ అంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే తప్ప థియేటర్ కు రావడం లేదు.

ఫిదాకు బ్యానర్ తోడయింది. హీరోయిన్ వుంది. హీరో వున్నారు. అప్పుడు శేఖర్ కమ్ముల కూడా ప్లస్ అయ్యారు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాకు బ్యానర్ కొత్త. హీరో, హీరోయిన్ కొత్త. కేవలం శేఖర్ కమ్ముల మాత్రమే అట్రాక్షన్. ఇలాంటపుడు ముందు నుంచీ హీరో హీరోయిన్ ను జనాలకు పరిచయం చేస్తూపోవాలి.

అలా కాకుండా సినిమా మొత్తం ఫినిష్ చేసి, విడుదలకు ముందు ఓ పేద్ద ఫంక్షన్ చేసి హీరో హీరోయిన్లను పరిచయం చేసి, సినిమా విడుదల చేయాలన్నది శేఖర్ కమ్ముల ప్లాన్ అంట. మరి ఇది వర్కవుట్ అవుతుందా? సినిమాకు మాంచి ఓపెనింగ్స్ తెస్తుందా? వెయిట్ అండ్ సీ.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments