మిస్టర్ మజ్ను మళ్లీ అదే గూటికి చేరాడు

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిజిటల్, శాటిలైట్ డీల్ కూడా పూర్తిచేశాడు నిర్మాత బీవీఎస్ఎన్.

కెరీర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ సినిమాల్ని వరుసగా దక్కించుకుంటున్న జీ తెలుగు ఛానెల్, అతడు నటిస్తున్న మూడో సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా దక్కించుకుంది. గతంలో ఈ హీరో నటించిన అఖిల్, హలో సినిమాలు కూడా ఈ ఛానెల్ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు మూడో సినిమా కూడా ఇక్కడికే చేరింది.

కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా, మిస్టర్ మజ్ను డిజిటల్ రైట్స్ ను కూడా ఈ ఛానెల్ దక్కించుకుంది. ఈ మొత్తం డీల్ విలువ అటుఇటుగా 5 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది.

త్వరలోనే దశలవారీగా సాంగ్స్ విడుదల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత జనవరి మూడోవారం లేదా నాలుగో వారంలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments