సామాజిక సేవలోనూ మేఘా ముందంజ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘ ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్) సామాజికసేవ కూడా తన బాధ్యతగా పరిగణించి ఇరు రాష్ట్రాల్లో అనేక గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. దేశంలో పలుచోట్ల ఆసుపత్రుల్లో రోగులకు, వారి బంధువులకు కూడా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నది. కేన్సర్ బారినిపడి బ్రతుకు ప్రశ్నార్థకం అయిన బాలబాలికలను కూడా తన సంరక్షణ ఖాతాలో వేసుకుంది. వారికీ కూడా మధ్యన భోజనం ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్ లో క్యాన్సర్ బాధితుల కోసం అత్యధునాతన సదుపాయాలతో ఒక పెద్ద భవంతిని నిర్మించి ఇచ్చింది. మార్కెట్ యార్డులో రైతుల ఆకలి తీర్చే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ చేపట్టింది.

రాజకీయాలకు అతీతంగా..
ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే గ్రామాల అభివ్రుద్ధిని విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తోడ్పడుతున్నది. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. ఆ నానుడిని నిజం చేసేలా ఎంఇఐఎల్ తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నది. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు గ్రామాల వికాసానికి మేఘా దోహదపడుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని జములపల్లిని దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ గ్రామంలో 40, 20 వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నది. ఈ పథకంలో ఫెరల్ అనే ఆత్యాధునిక టెక్నాలజీని వాడింది. దీని ద్వారా ప్రతి ఇంటికీ ఒకే ప్రెషర్ తో తాగునీరు వస్తుంది. జములపల్లిలో 12 కేవీ సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్ లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది.

కృష్ణాజిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్.. రెండు గ్రామాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రు గ్రామంలో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మించింది. మరుగుదొడ్లను, వీధుల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇదే గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ఎంఇఐఎల్. ఖాజా గ్రామంలో తాగునీటి కష్టాలను దూరం చేయడంతోపాటు రహదారులను ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలతోపాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ఎంఇఐఎల్.

డోకిపర్రులో ఇంటింటికీ గ్యాస్..
దక్షిణ భారతదేశంలోనే తొలి పీఎన్జీ గ్రామంగా డోకిపర్రు రికార్డ్ నెలకొల్పింది. మేఘా ఇంజనీరింగ్ డోకిపర్రు గ్రామంలో ఇంటింటికీ పైపుడ్ గ్యాస్ సదుపాయాన్ని 2019 జనవరి నుంచి కల్పిస్తున్నది. దీనివల్ల గ్రామస్తులకు తక్కువ ధరలో గ్యాస్ లభిస్తుందడంతోపాటు ఇది చాలా సురక్షితమైనది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకున్న మేఘా. ఈ గ్రామాల్లో రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పస్పుల, మురహరిదొడ్డి గ్రామాల్లో 250 ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతంలో నాగళాపురం, గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్.. ఈ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో బేంచీలు, డెస్కులను అందించారు. కళ్యాణ మండపాలు నిర్మించడంతోపాటు, పార్కులను ఏర్పాటు చేశారు.

ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 400 మందికి భోజనం..
ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడుతలో హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రితోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మలివిడుతలో నిజామాబాద్,  బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించిస్తున్నది ఎంఇఐఎల్. ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 400 మందికి భోజనాన్ని అందిస్తున్నది.

ఇలా ప్రతీ ఏటా దాదాపు 10 లక్షల మంది ఆకలిని భోజనామృత ద్వారా తీరుస్తున్నది మేఘా ఇంజనీరింగ్.  హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మేఘా. హైదరాబాద్ లోని ప్రాణం ఫౌండేషన్ కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఎంఇఐఎల్ బాసటగా నిలుస్తూ, వారికి వైద్యం అందిస్తున్నది. వరంగల్ నగరంలో న్యూలైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన హెచ్ఐవీ బాధిత చిన్నారులకు భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలిని తీరుస్తున్న ఎంఇఐఎల్.

అత్యాధునిక అంకాలజీ భవనం..
సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్ ఆసుపత్రిలో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో డాక్టర్, నర్సులకు వార్డులు, ఎమర్జన్సీ వార్డు, ల్యుకేమియా వార్డు, మహిళలు, పురుషులకు వార్డులతోపాటు పిల్లలకు కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఐసీయూ, బెడ్లు, ఆక్సీజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ లను మేఘా ఏర్పాటు చేసింది. 2018 సెప్టెంబర్ 23న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా అంకాలజీ భవనాన్ని ప్రారంభించారు.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments