మహేష్‌ హీరోయిన్‌ జాతకం మారిపోయింది

తెలుగులో తొలి సినిమాలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌తో రొమాన్స్‌ చేసిన కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌గా మారిపోయింది. కబీర్‌ సింగ్‌తో యువతని విశేషంగా ఆకట్టుకున్న కియారాకి బోల్డ్‌నెస్‌ కూడా ఎక్కువే. ఆమె నటించిన లస్ట్‌ స్టోరీస్‌ అనే నెట్‌ఫ్లిక్స్‌ సినిమాలో చేసిన 'మాస్టర్‌బేషన్‌' సీన్‌ ఇంటర్నెట్‌లో సంచలనమయింది.

కబీర్‌ సింగ్‌లో బెరుకు లేకుండా షాహిద్‌తో ముద్దుల వర్షం కురిపించిన కియారా బికినీల్లో కనిపించడానికి కూడా సై అంటుంది. అందుకే కియారా అద్వానీ కోసం బాలీవుడ్‌ నిర్మాతలు క్యూ కడుతున్నారు. కరణ్‌ జోహార్‌ ఇప్పటికే ఆమెతో రెండు పెద్ద సినిమాలకి సైన్‌ చేయించుకున్నాడు. దీపిక, ప్రియాంక, అనుష్క పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లకి కరవొచ్చింది.

దిషా పాట్నీ, కియారా అద్వానీ లాంటి వాళ్లకి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. వినయ విధేయ రామ డిజాస్టర్‌ అవడం వల్ల తెలుగులో కొన్ని ప్రాజెక్టులు చేజారడం కూడా కియారాకి అదృష్టంగా మారింది. లేదంటే టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా వుండి బాలీవుడ్‌ ఛాన్సులు పోగొట్టుకుని వుండేది. ఇక ఇప్పుడు కియారాని మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకి తీసుకురావడం జరగని పని. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..

Show comments