మహేష్ సినిమాకు పబ్లిసిటీ స్పెషలిస్ట్ లు

రాను రాను తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. యువరక్తం వచ్చి కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త స్క్రీన్ ప్లే విధానాలు, కొత్త అయిడియాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. మరో పక్క డిజిటల్ కంటెంట్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాల ప్రచారానికి కూడా కొత్త పద్దతులు అవసరం పడుతున్నాయి. సాంప్రదాయ విధానాలైన ప్రెస్ మీట్ లు, సక్సెస్ మీట్ లు, వంటి వాటికి కాలం చెల్లుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఔత్సాహిక ప్రచారకర్తలు కావాలంటే ప్రకటన వెలువడింది. ఈమేరకు సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఓ ట్వీట్ వేసారు. వాస్తవానికి ఇప్పటికే టాలీవుడ్ లో ప్రచారానికి సంబంధించి పలు సంస్థలు వున్నాయి. 

అయితే ఈ సంస్థలు అన్నీ కంటెంట్ మాత్రమే అందిస్తాయి. పబ్లిసిటీ సంగతులు మాత్రం నిర్మాతలు, వాటి టీమ్ మాత్రమే చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఔత్సాహికులను ఆ పనికి కూడా పరిచయం చేయబోతున్నారన్న మాట.

Show comments