పార్టీ అధికారంలో లేకపోయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ మాత్రం అత్యంత భారీ స్థాయిలో పెరిగింది. పార్టీ అధికారంలో ఉంటేనే నేతల ఆస్తుల విలువ పెరుగుతూ ఉంటుందనే నియమం ఏమీ లేకుండా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం అత్యంత భారీ స్థాయిలో సంపాదించేసింది.
అధికారం తెరాస చేతిలో ఉన్నా ఈ కాంగ్రెస్ నేత ఆస్తులు భారీగా పెరగడం విశేషం. ప్రత్యేకించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్. తమ పార్టీ అధికారంలో లేకపోయినా.. ఈయన వ్యాపారం భారీ స్థాయిలో సాగినట్టుగా ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపేరిట తక్కువ ఆస్తులనే చూపినా.. ఎలక్షన్ అఫిడవిట్ లో తన భార్య పేరిట మాత్రం భారీ స్థాయిలో ఆస్తులను చూపాడు. ఆయన భార్య పేరిట ఏకంగా రెండు వందలా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
ఓవరాల్ గా కోమటిరెడ్డి కుటుంబం ఆస్తులు మూడువందల కోట్ల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. గతంలో ఈయన దాఖలు చేసిన అఫిడవిట్ తో పోలిస్తే ఈసారి భారీ స్థాయిలో ఆస్తులు పెరిగినట్టుగా చూపించాడు ఈ కాంగ్రెస్ నేత.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలిచిన వారందరిలో కెళ్లా అత్యధిక ఆస్తులను చూపించింది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కావడం గమనార్హం.
రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్