చంద్రబాబుకు చాకిరేవు.. సోషల్ మీడియాలో ట్రెండ్

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, మీడియా ముందు చాకిరేవు పెట్టడం ఇవన్నీ సహజం. కానీ చంద్రబాబు కెరీర్ లోనే ఇంత ఇదిగా, ఇంత పద్ధతిగా ఎవరూ ఆయన్ని తిట్టి ఉండరు.

దగ్గరగా ఉన్న రోజుల్లో ఆయన వ్యవహార శైలి బాగా తెలిసున్న వ్యక్తి కావడంతో మంత్రి కొడాలి నాని, చంద్రబాబుని ఓ రేంజ్ లో ఉతికి ఆరేశారు. నిన్న ఈ ఘటన జరిగితే, ఇప్పటికీ సోషల్ మీడియాలో కొడాలి కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయంటే.. అతడి సెటైర్లు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. బాబును కొడాలి పద్ధతిగా తిడుతున్న క్లిప్స్, ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు ఒక ఫోర్ ట్వంటీ, దొంగ, మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని అందరూ చేసే విమర్శలు చేస్తూనే అన్నిటికీ పద్ధతిగా వివరణలు కూడా ఇచ్చారు నాని. ఇసుక కాజేసిన వ్యక్తి, ఇసుక కోసం దొంగ దీక్షలు చేసిన వ్యక్తి దొంగ కాక ఇంకేంటి అని ప్రశ్నించారు.

దీక్షలో చంద్రబాబు మెడలో ఇసుక పొట్లాలు ఎందుకు వేశారో కూడా నాని వివరించారు. మాంసం తిన్న వ్యక్తికి మెడలో ఎముకలు వేయకపోతే ఎలా అంటూ... అధికారంలో ఉండగా ఇసుక ఫలహారం చేశారు కాబట్టే దానికి సింబాలిక్ గా ఇలా ఇసుక పొట్లాలు మెడలో వేశామంటూ టీడీపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు.

వైసీపీ నేతల్ని ఆంబోతులంటూ కామెంట్ చేయడంపై ఆగ్రహించిన నాని, మేము ఆంబోతులమైతే నువ్వు కుక్కవా, లేక జిత్తులమారి నక్కవా అంటూ ప్రశ్నించారు. తండ్రి మరణంతో అండ కోల్పోయిన దేవినేని అవినాష్ కి, గెలవలేడని తెలిసినా గుడివాడ సీటిచ్చి పోటీ చేయమని పురమాయించి, కోట్ల రూపాయలు ఖర్చు చేయించారని, చంద్రబాబు కుటిల నీతికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. జీవితంలో చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి కాలేరని, ఆ ఆశ వదిలేసుకుని నీతిగా, నిజాయితీగా బతకాలని సూచించారు.

మొత్తమ్మీద కొడాలి నాని చంద్రబాబుకి పెట్టిన చాకిరేవు చూస్తే, ఇటీవల కాలంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎవరూ ఇంతగా మర్యాద చేయలేదనే విషయం అర్థమవుతుంది. అందుకే కొడాలి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్  అవుతున్నాయి. బాబును తిడుతూ అతడు మాట్లాడిన క్లిప్స్ ను కామెడీ సీన్లలా ఎంజాయ్ చేస్తున్నారు జనం.