రానాకు నో చెప్పిన కీర్తిసురేష్?

రీసెంట్ గా ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పాడు రానా. గుణశేఖర్ తో తీయాల్సిన హిరణ్యకశిప ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుండడంతో, ఆ స్థానంలో మిళింద్ రావు దర్శకత్వంలో ఓ హారర్ క్రైమ్ స్టోరీలో నటించడానికి అంగీకరించాడు. అయితే ఆదిలోనే ఈ ప్రాజెక్టుకు అడ్డంకి ఎదురైంది. హీరోయిన్ కీర్తిసురేష్, ఈ సినిమాలో నటించడానికి తిరస్కరించింది.

గతంలో గృహం లాంటి హారర్ సినిమా తీసి హిట్ కొట్టాడు మిలింద్. అతడిప్పుడు రానా హీరోగా సినిమా ప్లాన్ చేశాడు. మూవీలో రానాతో సమానంగా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంది. అది కూడా ఓ పోలీసాఫీసర్ పాత్ర కావడం విశేషం. ఈ క్యారెక్టర్ కోసం కీర్తిసురేష్ ను సంప్రదించగా, ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. కారణాలేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తోంది కీర్తిసురేష్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కావాలనుకుంటే రానా సినిమాకు ఆమె కాల్షీట్లు కేటాయించొచ్చు. కానీ పోలీసాఫీసర్ పాత్ర పోషించడానికి ఆసక్తి చూపించలేదు కీర్తిసురేష్.

ఇక రానా విషయానికొస్తే, ప్రస్తుతం విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయిన వెంటనే మిలింద్ రావు దర్శకత్వంలో సినిమా ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ నుంచి షూట్ ప్రారంభించాలని అనుకుంటున్నారు.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments