కమ్మోళ్లూ కమ్మోళ్లు.. కుమ్మేసుకుంటున్నారే!

'ఒంటి కన్ను నా కొ..నువ్వెంత నీ బతుకెంత.. ఏ రోజైనా గెలిచావారా నువ్వు.. పో వై..' అని ఒకరు, 'పోరా రేయ్.. నా కొడకా..' అంటూ ఇంకొకరు! నిన్న మొన్నటి వరకూ లేకి మాటలను ప్రత్యర్థుల విషయంలో మాట్లాడిన వారు, ఇప్పుడు తమలో తాము కలహించుకున్నారు.

ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ లు పరస్పరం అత్యంత తీవ్రమైన పదాలతో దూషించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం వారి తిట్లదండకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి పరిణామాలను చూసి.. ఖిన్నులవుతున్నారట వీర కమ్మ వాళ్లు!

తెలుగుదేశం పార్టీకి బద్దులైపోయి, తమ కులం అన్నింటికన్నా గొప్ప అనే భ్రమలోకి వెళ్లిన కొందరు కమ్మ వాళ్లు ఇప్పుడు తమ వాళ్లు తమ వాళ్లనే తిట్టుకుంటున్న తిట్లను వింటూ 'హతవిధీ..' అనుకుంటున్నారట!

కమ్మ వాళ్లలో కొందరు అపరిమితమైన కుల విషాన్ని కక్కారు. 'మన కులపోళ్లు రక్తదానం చేయవద్దు..' అనేంత వరకూ వెళ్లింది వాళ్ల కుల పిచ్చి.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో కొందరిలో ఆ కుల మదం పతాక స్థాయికి చేరిన వైనాలు కనిపించాయి. ఈ స్టేట్ మెంట్ అందరి విషయంలో కాదు, కొందరి విషయంలోనే. అలాంటి వారు ప్రస్తుత పరిణామాలను చూసి విస్తుపోతున్నట్టుగా తెలుస్తోంది.

ఒకే రోజు ఇద్దరు కమ్మ వాళ్లు తెలుగుదేశానికి ఝలక్ ఇచ్చారు. దేవినేని అవినాష్ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పగా, వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి మరింత గట్టి ఝలక్ ఇచ్చారు. చంద్రబాబును, లోకేష్ ను కూడా వంశీ కడిగేశారు. ఆ పై రాజేంద్రప్రసాద్ పై దూషణలు! 

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా మాటేమిటో కానీ, తెలుగుదేశం పార్టీకి కమ్మ వాళ్లే ఇస్తున్న ఝలక్ లు చూసి తెలుగుదేశ భక్త వీర కమ్మోళ్లు మాత్రం ఖిన్నులైన దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Show comments